త్యాగాలను ఎక్కిరించిన ఎవ్వడు సుఖంగా ఉండడు... నిజాయితీని ఎగతాళి చేసిన ఏ మొనగాడు ఆఖరి దాకా ఆనందంగా ఉండడు... జాగ్రత్త..
అగ్గిని అములుకొని కొందరు...
ఉరి కొయ్యలకు వేలాడి ఇంకొందరు..
గొంతులో గరళాన్ని పోసుకొని మరికొందరు..
ఒక్కరా... ఇద్దరా.. వందల సంఖ్యలో
స్వరాష్ట్రం కోసం
ఆయువులొదిలి
ఊపిరులూదిన
అమరులు ఎందరో
ఆ త్యాగాల ఫలం
ఈ తెలంగాణ.
అమరుల సమాధులపై
పీఠమెక్కి.. ఖాందాన్ మొత్తం
పొలోమనీ రాజ్యమేలింది!
గజదొంగలు కొందరు
భజన మండలి పెట్టుకొని
పదేండ్లలో
కోట్లకు పడగలెత్తిన్రు, ఇప్పుడు బీదలను ఎక్కిరిస్రండ్రు...త్యాగాలను ఏలన చేస్తుండ్రు.. పకృతి ఊరుకోదుగా.. ఉట్టిగనే వదులుగా.. ఇంటి బాధలు, ఒంటి బాధలతో పాటు, ఏడ్చిన ప్రతీ అణువు బాధను తానే సమతుల్యం చేస్తది. ఎప్పటికీ అమ్ముకోకు నమ్మకాన్ని ...
నమ్ముకో నిజాయితీని. నిటారుగా నిలబెడుతుంది.
No comments:
Post a Comment