మావొయిస్టుల రాక్షసత్వానికి బలైన 26 మంది సి.ఆర్.పి.ఎఫ్ కుటుంబాలలోని పిల్లల విద్యాబుద్దుల బాధ్యత పూర్తిగా స్వీకరించిన గౌతం గంబీర్ .. ఇది అమరవీరులకు నేనిచ్చే నివాళి అన్నారాయన .
అత్యవుసర_ ఆపద సమయంలో తోటివారికీ, తప్పనిసరి పరిస్థితుల్లో దేశానికి, ధర్మానికి ఉపయోగపడని సొమ్ము నీ కాడ ఎంత ఉన్న నిరుపయోగమే..
మనందరి భవిష్యతుకోసం, దేశంకోసం తమప్రాణాలను వదిలిన వారి కుటుంబాలకు అండగా ఉండాల్సిన భాద్యత ప్రబుత్వంతో పాటు సమాజంమీద కూడా ఉంది.. జవానుల కుటుంబాల పిల్లల భష్యత్తుకు అండగా ఉండాలన్న నీ నిర్ణయానికి అభినందనలు. జై హింద్✊.. భారత్ మాతాకి జై🙏🏻
Thursday, April 27, 2017
CONGRATULATIONS "GHAMBHEER"
Tuesday, April 18, 2017
Friday, April 14, 2017
KODHANDA RAAMALAYAM, RACHULUR.
రాళ్ళపై శిల్పాలు చెక్కినారు మనవారు సృష్టికే అందాలు తెచ్చినారు..
చరితబ్ల్య్ అందని ఆనవాళ్లు ఎన్నో..
చరిత్రకు అందించని ఆనవాళ్ళు కొన్ని..
చరిత్రకు ఎలా తెలపాలో తెలియక మరుగునపడ్డవీ కొన్ని..
తెలియక చేసిన తప్పులు కొన్ని, తెలిసిచేసిన తప్పులు కొన్ని...
అయినా ఆగలే..ఆగవు కూడా..
ధర్మంయొక్క ఆనవాళ్ళను తమకు తోచిన రీతిన కాపాడుతూ భావితరాలకు అందించాలన్ని మీ ఆర్ద్రతే వాటిని ప్రపంచానికి చాటుతుంది కాస్త ఆలస్యమైనా.
భాగ్యనగరానికి అతిదగ్గరలో, రాచులూరు గుట్టలమద్య, చెరువు వెనకాల, రాల్లలో స్వయంభుగా వెలసిన కోదండరామస్వామి.. ఎవరి అజమాయిషి, ఆదిపత్యం లేక వారంపాటు సాగే జనజాతర.... చిన్న చిన్న దుకాణాలు, మిఠాయి కొట్లు, గాజుల దుకాణాలల్లో సందడి, చిన్నపిల్ల కోసమ్ ఎన్నో.. ఇప్పటికీ ఇంకా
కొనసాగుతున్న విధానం చూస్తే ఆశ్చర్యం. ఆనందం. శరవేగంగా అన్నిరకాలుగా అభివృద్ది చెందుతున్నా జనాలకు జారతల పట్ల ఏ మాత్రం తగ్గని మక్కువ. కాని ఆలానే కొనసాగని.
Monday, April 10, 2017
COMMON MAN
అవును.. అత్యవుసరం, అనివార్యం కూడా.
ప్రభుత్వ ఖజానా నుండి జీతాలు తీసుకుంటున్న ప్రతీ వ్యవస్థలోని ప్రతీ వ్యక్తి (సర్పంచ్ నుండి రాష్ట్రపతి _అటెండర్ నుండి కలెక్టర్ వరకు) తమ కుటుంబ సబ్యుల పిల్లలను విధిగా ప్రభుత్వ బడుల్లో చదివించాలి. ప్రతిభావంతులే ప్రబుత్వ ఉద్యోగాలు సాధిస్తారు. అలాంటి వారే పిల్లల భవిష్యత్తుకోసం ఆలోచిస్తారు. అందుకే తమపిల్లల్లాగా అందరూ ఎదగాలని ఆలోచిస్తే వ్యవస్థ బాగుపడతది. గమనించాల్సింది వీరంతా ప్రజా ధనం నుండి జీతాలు పొందుతున్నారు. వ్యవస్థ బాగుకోసం ముందడుగు వేయాలి. వీరికి ప్రభుత్వ_ ప్రజాధనం నుండి జీతాలు కావాలి గాని ప్రభుత్వ ఆధీనంలో నడిచే ఏ వ్యవస్థ మీద నమ్మకం లేదని ప్రజలు ప్రశ్నించి, తప్పనిసరి పరిస్థితుల్లో తమ పిల్లల భవిష్యత్తు కోసం తిరగబడక ముందే వ్యవస్థ తెరుకోవాలి. ఇది అత్యవుసరం, అనివార్యం కూడా..దేశంకోసం.
Sri SARASWATHI MAHA YAGNAM_2018
TQ dear GSS TRUSTEES.
Gnana Saraswathi SewaSamithi(GSS) TRUSTEES meeting Successfully completed on 08.04.2017. selected the 150 names from all our Well-wishers fr 6 different Committees fr SARASWATHI MAHA YAGNAM with 108 Idols vl b held in Jan_2018.
రేపటి తరంకోసం నేడు మనం వెచ్చిస్తున్న ప్రతీ నిమిషం విలువైనదే. సంపద కంటే కూడా సమయానికే యెక్కువ విలువిస్తున్న నేటి కాలంలో, మనం చేస్తున్న పని, ఇస్తున్న సమయాన్ని చూసి కొంతమంది నవ్వుకున్నా, అప్పుడప్పుడూ మనకూ ఇంత అవసరమా అని అనిపించినా.. నిరాశ పడక, నిస్వార్దంగా మనం చేస్తున్న పని యొక్క ఫలాలు కాస్త ఆలస్యమైనా సమాజానికి తప్పక అందుతాయి.
అరటి పండ్ల గెల లాగే గొప్ప పని అనేదేది హఠాత్తుగా సృష్టించబడలేదు. అరటిపండు కావాలంటే, ఆది పువ్వు పూచే దాకా వేచి ఉండాలి, తర్వాత కాయలు, పండాలి. ఆ తర్వాతే పండ్లు.
ఆలాగే గొప్ప కార్యాలను మనం శక్తితో సాధించలేం, ఓర్పు, పట్టుదలతో మాత్రమే సాధించగలం.
మనం సంకల్పించిన కార్యంకూడా అలాగే అనుకుందాం.
మనవల్ల అయ్యేవి చేయడం ద్వారా మనకు శక్తి రాదు. ఒకప్పుడు మనం చేయలేమనుకున్న వాటిని అధిగమించినప్పుడే మనకూ ఆ శక్తి వస్తుంది.. అంతే గాక నిజాయితిగా జరిగే ఏ పనికైనా ఆ దైవ / ప్రకృతి సహకారం తప్పక ఉంటుంది అంటారు. కాబట్టి మనం చేసే పనిలో నిజాయితి లోపించకుండ జాగ్రత్తపడటమే మనం చేయాల్సిన అతిపెద్ద పని.
ఆశావాదులుగా ఉందాం.. తప్పకుండా మనం సంకల్పించిన మహా యజ్ఞం దిగ్విజయం అవుతుంది. దాని ఫలాలూ సమాజానికి అందుతాయి. ఆ సమాజంలో మనమూ ఉంటాము. జయహో..
Sunday, April 9, 2017
ప్రతిభకు చేయుతనిద్దాం
GOOD Efforts by SaiKumar ,Inter 1st year from NijaMpEt Medipally, Vikaarabad Dist.
Completed the pic of Sadasya's in 3hrs. He is Old student of Gnana Saraswathi #RURALGENIUS _పల్లె ఆణిముత్యాల Camp _2015.
Painting is his #PASSION. pls bless him for his Bright Future
#Pencilpainting
గొప్ప అభిరుచితో, పెయింటింగ్ అంటే ప్రాణంగా ఎదుగుతున్న సాయికుమార్.. ఆ రంగంలో గొప్పగా ఎదగాలని, ఎందరో పల్లెఆణిముత్యాలకు ప్రేరణనవ్వాలని ఆశిద్దాం.
Friday, April 7, 2017
RACHAKONDA లో రామ కళ్యాణం @ శ్రీరామనవమి_2017
#RACHAKONDA #TELANGANA #CapitalCity
రాచకొండలో రాముని కళ్యాణం. కమణీయం.. రమణీయం.. అంతా రామమయం.
కల్మషం లేని పల్లె మనుషుల నిండు హృదయాలతో అ కళ్యాణ తంతు ఓ మధురఘట్టం.
ఎప్పటిలాగే ఏ అధికారుల ఆదరణలేక, పాలకుల పలరింపు అసలే లేక...లోక క్షేమం ఆశించి స్పందించిన కొన్ని హృదయాలే "లోకకళ్యాణం కోసమే ఆ రామ కళ్యాణం" అని ముందుండి నిర్వహించుకున్న రమణీయ కళ్యాణం.
భాగ్యనగర్, రంగారెడ్డి ,యాదాద్రి & నల్లగొండ జిల్లాల జనాలతో పాటు, కొండ చుట్టూరా ఉన్న తండాల నుండి తండోపతండాలుగా వచ్చి కొండకింద స్వయంభుగా వెలసిన ఆ కోదండరాముని కళ్యాణం తిలకించి పులకకించిన దృశ్యం అద్బుతం...
రాచకొండ కాదేమో ఇది రాముని కొండ అనుకుంటూ.. ఆయన దీవెనలే మాకు అండాదండా అంటూ రాత్రంతా భజనలు, జాగారాలతో కొండంతా కోలాహలం చేసిన సన్నివేశం అద్భుతం.
ఎవరి అండాదండా లేకుండానే ఇంత ఘనంగా జరుగుతున్న ఈ ఉత్సవం .. పాలకులు స్పందించి, ముందుండి ఘనంగా నిర్వహిస్తే ఆ భద్రాద్రిలో జరిగే రామకళ్యాణంలా జరపొచ్చనేది జనాల అభిప్రాయం...
"ఎవరి ఆజ్ఞా లేకున్నా లోకహితం కోరి "రాచకొండలో రామకళ్యాణానికి " సహకరించిన సహృదయులందరికీ అందరితరపునా అభినంధనలు, దన్యవాదాలు". వచ్చే ఏడుకన్నా పాలకులకు కనువిప్పు కలిగి ఉత్సవం గొప్పగా చేస్తారని ఆశిద్దాం. ప్రకృతి రమణీయంగా ఉండే ఈ ప్రాంతం ఆ "శివ రాముల" నివాస స్థలం.. అందుకే ఇదొక ఆద్యాత్మికతతో కూడిన "సామజిక చైతన్యకేంద్రం" కావాలి. ఈ రాష్ట్రానికే ఒక మణిహారం కావాలి మన ఈ రాచకొండ.
ఇన్నాల్లు దీని ఆనవాళ్ళు నిలిచేలా చూసిన అన్ని దళాలకు హ్రదయపూర్వక దన్యవాదాలు.