Thursday, June 13, 2024

వివేకానంద శిలాస్మారక కథ

సమాప్తం...తప్పక చదవాల్సిన పుస్తకం.
మాతృభూమిపై గాఢమైన ప్రేమతో నిండి ఉన్న హృదయంతో స్వామి వివేకానంద యావద్భారత పర్యటనకు బయలుదేరారు. ఆయన కన్యాకుమారి వచ్చి 1892 డిసెంబర్ 25,26,27తేదీలలో సముద్రం మధ్య ఉన్న శిలపై కూర్చొని భారత దేశపు భూత, వర్తమాన,భవిష్యత్తుల గురించి ధ్యానం సలిపారు.
వైభవోపేతమైన భారతదేశం కొరకై తన జీవన కార్యాన్ని ఆయన ఈ శిలపైనే గ్రహించారు. తదనంతరం భారతీయ ఆధ్యాత్మికతతో ప్రపంచాన్ని కుదిపివేశారు. ఈ పవిత్ర స్థలంలో శ్రీ ఏకనాథ రానడే నిర్మించారు..
ఆ నిర్మాణం కోసం జరిగిన 
వ్యవప్రయాసలు చాలా కఠినమైనవి. ఓర్పుతో,సమయ స్ఫూర్తితో, చాకచక్యంతో వారు చేసిన ఈ అద్భుత కార్యం చాలా మంది సామాజిక కార్యకర్తలకు స్ఫూర్తి వంతం..

Sunday, June 9, 2024

దీక్ష విరమణ @ కన్యా కుమారి

*దీక్ష విరమణ @ సుచీంద్రం, కన్యాకుమారి*.
on 09.06.2024.

అనామకలమైన మనలాంటి సామాన్యుల మస్తిష్కాలలో ఆశలు, ఆశయాలు, సంకల్పాలు చొప్పించి, మనను ఒప్పించి వాటి సాకారానికి కావలసిన శక్తిని ప్రసాదించి, అవసరమైన ఉపకరణాలనూ కల్పించి, ఆ పనిని పూర్తి చేసుకునే వారే దేవతలు. 
ఆ ఉపకరణాలు మనమే అయితే అది మహా భాగ్యం...
పుష్కరకాలం(12ఏండ్లు)క్రితం వీరపట్నo పెదచెరువు కొనకట్టన  108అడుగుల శ్రీ పంచముఖ హనుమాన్ విగ్రహ నిర్మాణ సంకల్పం చొప్పించి, అవసరమైన  ఉపకరణాలు అందిస్తూ ముందుకు తోస్తున్న ఆ దేవదేవుడు🙏.. 
*ఆ నిర్మాణo కోసం శంకుస్థాపన జరిగితేనే తలనీలాలు తీస్తాననే దీక్షను చేపట్టిన ఐదేళ్లకు @ 30.03.2024 రోజున శంకుస్థాపన కోసం అనుగ్రహించి, దీక్ష విరమణకు అదృష్టం కల్పించిన కన్యాకుమారి దగ్గర  సుచీద్రo దేవాలయ ఆంజనేయ స్వామికి శిరసా ప్రణామాలు* 🙏🙏.
:~ సదా వెంకట్,
*హరివర అఖండ క్షేతసమితి*